Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు పచ్చి మోసకారి.. ఎమ్మెల్సీ ఇస్తానని ఇవ్వలేదు : సినీ నటి కవిత

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆ పార్టీకి చెందిన సీనియర్ మహిళా నేత, సినీ నటి కవిత సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఓ మోసకారి అంటూ ఆమె తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు వార్తలు వస్తున్నాయి.

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2017 (09:01 IST)
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆ పార్టీకి చెందిన సీనియర్ మహిళా నేత, సినీ నటి కవిత సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఓ మోసకారి అంటూ ఆమె తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు టిక్కెట్ ఇస్తానని చెప్పి నమ్మించి, తీరా వేరే వాళ్లకు ఇచ్చారని ఆమె ఆరోపించారు. 
 
టీడీపీలో ఆర్య వైశ్యులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని గత కొంత కాలంగా విమర్శలు చేస్తున్న ఆమె, కష్టపడిన వారికి గుర్తింపు లభించడం లేదన్న ఆగ్రహంతో ఆమె టీడీపీకి గుడ్‌బై చెప్పాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని తన అనుచరుల వద్ద ప్రస్తావిస్తూ... ఎమ్మెల్సీ పదవులతో పాటు నామినేటెడ్ పదవులు వైశ్యులకు దక్కలేదని, తనకు ఎమ్మెల్యే సీటిస్తానని చెప్పి కూడా ఇవ్వలేదని ఆమె అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం. 
 
ఎన్టీఆర్ ఉన్నప్పటి టీడీపీ, ఇప్పడున్న పార్టీకి పోలిక లేదని కూడా వ్యాఖ్యానించారని సమాచారం. ఈ సంవత్సరం మహానాడులో తనను అవమానించారని, తనతో కన్నీరు పెట్టించారని కవిత వాపోయిన్నారు. ఇక ఆమె వైకాపాలో చేరుతారని కూడా ఇటీవల వార్తలు వచ్చాయి. బీజేపీ వైపు చూస్తున్నట్టు కూడా కొన్ని కథనాలు వచ్చాయి. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments