Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం చంద్రబాబును కలిసిన సోనుసూద్ : 4 అంబునెల్స్‌ల విరాళం

ఠాగూర్
సోమవారం, 3 ఫిబ్రవరి 2025 (18:11 IST)
ప్రముఖ నటుడు సోనుసూద్ ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును సోమవారం అమరావతిలోని సచివాలయంలో కలిశారు. మర్యాద పూర్వకంగా తనను కలవడానికి వచ్చిన సోనూసూద్‌ను ఈ సందర్భంగా చంద్రబాబు అభినందించారు. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ఇందులో ‘సూద్‌ ఛారిటీ  ఫౌండేషన్‌’ భాగస్వామి అయినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
 
అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సోనూసూద్‌ ఫౌండేషన్‌ నాలుగు అంబులెన్స్‌లను అందించింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును కలిసిన సోనూసూద్‌.. ఫౌండేషన్‌ అంబులెన్స్‌లను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు. అనంతరం నాలుగు అంబులెన్స్‌లను సీఎం ప్రారంభించారు. 
 
కాగా, కరోనా మహమ్మారి సమయంలో సోనుసూద్ అనేక వేల మందికి తన వంతు సాయం చేసిన విషయం తెల్సిందే. అలాగే, తన కంపెనీల్లో అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. అలాగే, ఆపదలో ఉన్న అనేక మందిని ఆయన వివిధ రూపాల్లో ఆదుకుని తాను రీల్ హీరో కాదని రియల్ హీరో అని నిరూపించుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments