వైజాగ్‌లో పెయిడ్ ఆర్టిస్టులతో పెట్టుబడల సదస్సు: హీరో బాలకృష్ణ సెటైర్లు

ఠాగూర్
శుక్రవారం, 3 మే 2024 (08:58 IST)
వేలాది ఎకరాల భూములను ఇచ్చి అమరావతి ప్రాంత రైతులను పెయిడ్‌ ఆర్టిస్టులతో ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పోల్చారని సినీ హీరో బాలకృష్ణ అన్నారు. అలాంటపుడు విశాఖపట్టణంలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న పెయిడ్ ఆర్టిస్టులు ఎవరి ఆయన ప్రశ్నించారు. పైగా, విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో ఎంత పెట్టుబడులు? ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చారో చెప్పాలంటూ శాసనసభ సాక్షిగా అడిగితే సమాధానం చెప్పలేకపోయారని.. దీన్ని బట్టి ఎవరు పెయిడ్‌ ఆర్టిస్టులో తేలిపోయిందన్నారు. 
 
స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా గురువారం విజయనగరం జిల్లా చీపురుపల్లి, విజయనగరంలలో నిర్వహించిన బహిరంగ సభలలో ఆయన మాట్లాడారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ద్వారా రైతుల భూములను కుదువపెట్టి ప్రభుత్వం అప్పులు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోందని, రేపు మీ అవసరాలకు ఆ భూమిపై రుణం తెచ్చుకోవాలనుకుంటే కుదరదని, రైతులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైకాపా ప్రభుత్వం రద్దు చేసిన 25 సంక్షేమ పథకాలను తిరిగి ప్రారంభించి కొనసాగిస్తామన్నారు. ఓటేసే ముందు ఐదేళ్లలో జరిగిన అరాచక పాలన మళ్లీ కావాలో, టీడపీ అభివృద్ధి కావాలో నిర్ణయించుకోవాలని సూచించారు. 
 
విద్య అంటే తెలియనివారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉండడం దురదృష్టకరమని మంత్రి బొత్స సత్యనారాయణను ఉద్దేశించి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఒక సర్వే వెల్లడించిన వివరాల మేరకు ఐదో తరగతి పిల్లవాడు మూడో తరగతి స్థాయి లెక్కలనూ చేయలేకపోవడాన్ని ప్రస్తావించారు. దీన్నిబట్టి విద్యా ప్రమాణాలు ఏ రీతిలో ఉన్నాయో అర్థమవుతోందని అన్నారు. పిల్లల భవిష్యత్తుతో ఆటలు ఆడుకోవద్దని విద్యాశాఖ మంత్రిని తల్లిదండ్రులు నిలదీయాలని పిలుపునిచ్చారు. సభలో ఎన్డీయే కూటమి చీపురుపల్లి అభ్యర్థి కిమిడి కళావెంకట్రావు, విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, తెదేపా పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున, మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు, జనసేన, భాజపా నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments