Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్‌లో పెయిడ్ ఆర్టిస్టులతో పెట్టుబడల సదస్సు: హీరో బాలకృష్ణ సెటైర్లు

ఠాగూర్
శుక్రవారం, 3 మే 2024 (08:58 IST)
వేలాది ఎకరాల భూములను ఇచ్చి అమరావతి ప్రాంత రైతులను పెయిడ్‌ ఆర్టిస్టులతో ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పోల్చారని సినీ హీరో బాలకృష్ణ అన్నారు. అలాంటపుడు విశాఖపట్టణంలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న పెయిడ్ ఆర్టిస్టులు ఎవరి ఆయన ప్రశ్నించారు. పైగా, విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో ఎంత పెట్టుబడులు? ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చారో చెప్పాలంటూ శాసనసభ సాక్షిగా అడిగితే సమాధానం చెప్పలేకపోయారని.. దీన్ని బట్టి ఎవరు పెయిడ్‌ ఆర్టిస్టులో తేలిపోయిందన్నారు. 
 
స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా గురువారం విజయనగరం జిల్లా చీపురుపల్లి, విజయనగరంలలో నిర్వహించిన బహిరంగ సభలలో ఆయన మాట్లాడారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ద్వారా రైతుల భూములను కుదువపెట్టి ప్రభుత్వం అప్పులు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోందని, రేపు మీ అవసరాలకు ఆ భూమిపై రుణం తెచ్చుకోవాలనుకుంటే కుదరదని, రైతులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైకాపా ప్రభుత్వం రద్దు చేసిన 25 సంక్షేమ పథకాలను తిరిగి ప్రారంభించి కొనసాగిస్తామన్నారు. ఓటేసే ముందు ఐదేళ్లలో జరిగిన అరాచక పాలన మళ్లీ కావాలో, టీడపీ అభివృద్ధి కావాలో నిర్ణయించుకోవాలని సూచించారు. 
 
విద్య అంటే తెలియనివారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉండడం దురదృష్టకరమని మంత్రి బొత్స సత్యనారాయణను ఉద్దేశించి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఒక సర్వే వెల్లడించిన వివరాల మేరకు ఐదో తరగతి పిల్లవాడు మూడో తరగతి స్థాయి లెక్కలనూ చేయలేకపోవడాన్ని ప్రస్తావించారు. దీన్నిబట్టి విద్యా ప్రమాణాలు ఏ రీతిలో ఉన్నాయో అర్థమవుతోందని అన్నారు. పిల్లల భవిష్యత్తుతో ఆటలు ఆడుకోవద్దని విద్యాశాఖ మంత్రిని తల్లిదండ్రులు నిలదీయాలని పిలుపునిచ్చారు. సభలో ఎన్డీయే కూటమి చీపురుపల్లి అభ్యర్థి కిమిడి కళావెంకట్రావు, విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, తెదేపా పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున, మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు, జనసేన, భాజపా నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

Sumaya Reddy: గుడిలో కన్నా హాస్పిటల్‌లో ప్రార్థనలే ఎక్కువ.. అంటూ ఆసక్తిగా డియర్ ఉమ టీజర్

పెద్ది సినిమా గేమ్ ఛేంజర్ కాబోతోంది.. రామ్ గోపాల్ వర్మ కితాబు

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments