Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల కొండపై నటి అర్చన గౌతమ్‌ నానా రచ్చ... టీటీడీ వివరణ

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (11:34 IST)
Archana Gautam
ఉత్త‌రప్ర‌దేశ్‌కు చెందిన శ్రీ శివ‌కాంత్ తివారి, న‌టి అర్చ‌నా గౌత‌మ్‌తో పాటు మ‌రో ఏడుగురికి ఆగ‌స్టు 31న శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం కేంద్ర స‌హాయమంత్రి నుంచి సిఫార‌సు లేఖ‌ను తీసుకుని తిరుమ‌ల‌కు వ‌చ్చారు. అద‌న‌పు ఈవో కార్యాల‌యంలో ద‌ర్శ‌నం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.
 
యూపీ చెందిన నటి అర్చన గౌతమ్‌ తిరుమల కొండపై నానా రచ్చ చేసిన సంగతి తెలిసిందే. దర్శనం కోసం పదివేల రూపాయలు పెట్టి టికెట్ కొన్న కూడా టీటీడీ తనకు టికెట్ ఇవ్వలేదని ఆరోపించింది. కౌంటర్‌కి వెళ్లి అడగ్గా సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని ఆమె ఆరోపించింది. ఈ సంఘటనకు సంబంధించిన ఆమె సెల్ఫీ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
 
అయితే తాజాగా ఈ ఘటనపై టీటీడీ అధికారులు స్పందించారు. తమ సిబ్బంది నటిపై దాడి చేయడం అబద్ధమని టీటీడీ పేర్కొంది. ఈ మేరకు పూర్తి వివరాలతో టీటీడీ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో అధికారులు వివరణ ఇచ్చారు. 
 
ఈ మేరకు ట్వీట్‌ చేస్తూ.. టీటీడీ ఉద్యోగులపై నటి అర్చనా గౌతమ్‌ దాడి హేయమైన చర్య అని, అవాస్తవ ఆరోపణలతో ఉద్యోగులపైనే తప్పుడు ఫిర్యాదు చేయటాన్ని టీటీడీ ఖండిస్తూ ఈ ఘటనకు సంబంధించి వరుస ట్వీట్లలో వివరణ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments