Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనాడు జగన్ మోహన్ రెడ్డికే వార్నింగ్... ఇపుడు రోడ్లపై పిచ్చిదానిలా... ఏమైంది?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగిపోయాక, సచివాలయం ఉద్యోగులు హైదరాబాద్ నగరాన్ని వీడి వచ్చేందుకు ఎన్నో సందేహాలు వ్యక్తం చేశారు. చాలామంది ఉద్యోగాలు మానేసి ఇంట్లో కూర్చుందామన్న ఆలోచనకు కూడా కొందరు వచ్చారనే

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (16:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగిపోయాక, సచివాలయం ఉద్యోగులు హైదరాబాద్ నగరాన్ని వీడి వచ్చేందుకు ఎన్నో సందేహాలు వ్యక్తం చేశారు. చాలామంది ఉద్యోగాలు మానేసి ఇంట్లో కూర్చుందామన్న ఆలోచనకు కూడా కొందరు వచ్చారనే వార్తలు కూడా వినవచ్చాయి. ఐతే అలాంటివారందరికీ భరోసానిస్తూ హైదరాబాద్ నగరం నుంచి అమరావతికి సైకిల్ యాత్ర చేపట్టి ఎందరో ఉద్యోగులకు రోల్ మోడల్‌గా నిలిచారు. ప్రస్తుతం తిరువూరుకి ఏసీటీవోగా పనిచేస్తున్న పద్మ. ఆమె కొద్ది రోజుల క్రితం కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు మధ్య జరిగిన వాగ్వాదం సమయంలో ఏకంగా జగన్ మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. సెల్ఫీ తీసి మరీ యూ ట్యూబులో పెట్టేశారు. 
 
ఐతే ఇంతలో ఏమయిందో తెలియదు కానీ ఆమె ఓ పిచ్చిదానిలా రోడ్లపైకి వచ్చేశారు. గురువారం నాడు తిరువూరులోని ఓ సిమెంట్ షాపు వద్దకు వెళ్లి తనిఖీలు చేయాలంటూ హంగామా చేశారు. దానితో సిమెంట్ వ్యాపారి ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా దుర్భాషలాడారు. ఆమె వాలకం చూసి అనుమానం వచ్చిన యజమాని పోలీసులకు సమాచారం అందించారు. 
 
పోలీసులు రంగప్రవేశం చేసి ఆమెను అక్కడి నుంచి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దానితో పోలీసులు ఆమె నుంచి తప్పించుకోవాల్సి వచ్చింది. ఎలాగో ఆమెను అక్కడి నుంచి పోలీసు స్టేషనుకు తరలించి కేసు నమోదు చేసేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తుండగా, అంతలో పద్మ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని కొద్దిరోజులుగా పద్మ మానసిక స్థితిని కోల్పోయారనీ, ప్రస్తుతం వైద్య చికిత్స చేయిస్తున్నట్లు వెల్లడించారు. ఐతే ఎంతో మనోధైర్యంతో ముందుకు దూసుకువెళ్లిన ఈ మహిళ ఇలా మానసిక స్థితిని కోల్పోవడం బాధాకరం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాలీవుడ్ స్థాయిలో రాణిస్తున్న భారత డిజైనర్లు...

మంచు విష్ణుకు శ్రీవిష్ణు క్షమాపణలు ఎందుకంటే...

'కింగ్‌డమ్' నుంచి వైల్డ్ పోస్టర్‌ను రిలీజ్ చేసి మేకర్స్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments