Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల ఘాట్‌రోడ్డులో జీపు బోల్తా - ముగ్గురి పరిస్థితి విషమం

Webdunia
గురువారం, 5 మే 2016 (18:26 IST)
తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులోని 18వ మలుపు వద్ద జీపు లోయలోకి దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో 8 మంది భక్తులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో రహదారిపై వెళుతున్న వాహనదారులు స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను లోయలో నుంచి బయటకు తీసి తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. 
 
గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. క్షతగాత్రులు ఖమ్మం జిల్లా కొత్తూరు తాండాకు చెందిన భీముడు, మణి, లక్ష్మీమోహన్‌, రంగిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments