Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేసేది మేస్త్రీ పని... ఇంట్లో కిలోన్నర బంగారం.. రూ.1.25 కోట్లు స్వాధీనం.. ఎక్కడ?

శ్రీవారి కానుకలను తిరుమల తిరుపతి దేవస్థానంలోని కొందరు అవినీతిపరులైన ఉద్యోగులు ఏవిధంగా దోచుకుంటున్నారో మరోమారు నిరూపితమైంది. తితిదే కళ్యాణకట్టలో మేస్త్రీ ఉద్యోగం చేస్తున్న ఓ ఉద్యోగి ఇంట రూ.1.25 కోట్ల న

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2016 (11:11 IST)
శ్రీవారి కానుకలను తిరుమల తిరుపతి దేవస్థానంలోని కొందరు అవినీతిపరులైన ఉద్యోగులు ఏవిధంగా దోచుకుంటున్నారో మరోమారు నిరూపితమైంది. తితిదే కళ్యాణకట్టలో మేస్త్రీ ఉద్యోగం చేస్తున్న ఓ ఉద్యోగి ఇంట రూ.1.25 కోట్ల నగదుతో పాటు కిలోన్నర బంగారాన్ని టీటీడీ విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఇంట్లో సోదాలు చేపట్టిన అధికారులకు అవాక్కయ్యారు. వారు విస్తుపోయేలా వాస్తవాలు బయటపడ్డాయి. కొర్లకుంటలోని తంగవేలు ఇంట్లో సహా, ఆయన సమీప బంధువుల ఇళ్లలో ఉదయం నుంచి సోదాలు జరుగుతుండగా, ఇప్పటివరకూ రూ.1.25 కోట్ల విలువైన నగదు, ఆస్తి పత్రాలు, కిలోన్నరకు పైగా బంగారం పట్టుబడినట్టు అధికారులు తెలిపారు. 
 
తంగవేలు బినామీల పేరిట కూడా భారీఎత్తున ఆస్తులను కూడబెట్టినట్టు అధికారులు తేల్చారు. తమ సోదాల్లో మరిన్ని ఆస్తులు వెలుగులోకి వచ్చే అవకాశముందని, ఇదంతా అక్రమ సంపాదనేనని, విషయాన్ని టీటీడీ అధికారులకు వివరిస్తామని అ.ని.శా పేర్కొంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments