Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్షేమాభివృద్ధి కార్పొరేషన్‌ ఎండీ ఆస్తులు వారేవా!

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (12:34 IST)
ప్ర‌భుత్వం డ‌బ్బులేక‌, దివాళా తీస్తుంటే... ప్ర‌భుత్వ అధికారులు మాత్రం కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తుతున్నారు. ఏపీ సంక్షేమాభివృద్ధి కార్పొరేషన్‌ ఎండీ ఆస్తులు చూస్తే, ఎవ‌రైనా వారేవా అనాల్సిందే! 
 
 
ఏపీ సంక్షేమాభివృద్ధి కార్పొరేషన్‌ ఎండీ బిల్లురి నాగభూషణం ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేసింది. విజయవాడ, హైదరాబాద్ లలో సహా  ప‌లు చోట్ల ఏక కాలంలో ఏసీబీ సోదాలు జ‌రిగాయి. విజయవాడలో ఏకకాలంలో పలు చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌ కావూరి హిల్స్‌, నిజాంపేట, మోయినాబాద్‌లో ఫాంహోస్‌లను ఏసీబీ గుర్తించింది. అలాగే విజయవాడ పోరంకిలోని ఆఫీసులో ఏసీబీ తనిఖీలు చేసింది.


ఎండీ బిల్లురి నాగభూషణం కుటుంబ సభ్యులకు చెందిన ఇంటి స్థలం, 5 ఇళ్లు, జి+5 ఫ్లోర్‌ బిల్డింగ్‌ను ఏసీబీ అధికారులు డాక్యుమెంట్ల‌తో స‌హా గుర్తించారు. వీటితోపాటు 3 కార్లు, బైక్‌, వెండి, బ్యాంక్‌ బ్యాలెన్స్‌ సుమారు 5.93 కోట్ల మేర ఉంటుందని అంచనా వేస్తున్నారు.            

 
ఏపీ సంక్షేమాభివృద్ధి కార్పొరేషన్‌ ఎండీ బిల్లురి నాగభూషణం వ‌ద్ద దాదాపు 4.34 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించారు. దర్యాప్తు అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో ఆయ‌న్ని హాజరు పర్చనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments