Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి కోదండరామస్వామి ఆలయం డిప్యూటీ ఈవో ఇంట్లో సోదాలు.. అవినీతికి..?

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (18:35 IST)
తిరుపతిలోకి శ్రీ కోదండరామ స్వామి ఆలయం డిప్యూటీ ఈవోగా పనిచేస్తున్న భూపతిరెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయనకు ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు సమాచారం అందడంతో భూపతి రెడ్డి నివాసంతో పాటు బెంగళూరులోని ఆయన బంధువుల ఇళ్ళల్లోనూ సోదాలుజరుపుతున్నారు. ప్రస్తుతానికి భూపతిరెడ్డి పర్యవేక్షణలో 30 ఆలయాలున్నాయి. 
 
ఆలయ పర్యవేక్షణలో ఉండగా.. ఆయన అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. అంతేగాకుండా తిరుపతిలో నాలుగంతస్తున్న భవనం, రెండు లాకర్లు, 30కి మించిన ఇంటి స్థలాల డాక్యుమెంట్లు, తిరుచానూరులో లాడ్జి వంటివి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

అంతేగాకుండా 18 స్థలాలను అమ్మినట్టు కూడా అవినీతి నిరోధక శాఖాధికారులు నిర్ధారించినట్లు తెలుస్తోంది. ఇవే గాకుండా ఈ దాడుల్లో ఆయన ఇంట్లో పలు కీలకమైన ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments