Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్లర్క్ ఉద్యోగంలో చేరి రూ.కోట్లకు పడగలెత్తిన బీసీ సంక్షేమ అధికారి

Webdunia
గురువారం, 5 జనవరి 2023 (13:33 IST)
తిరుపతి జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ అధికారి ఆర్.యుగంధర్ కోట్లాది రూపాయలకు పడగలెత్తారు. ఆయన చిన్నపాటి క్లర్క్ ఉద్యోగంలో చేరి ఇపుడు జిల్లా సీబీ సంక్షేమ విభాగం డిప్యూటీ డైరెక్టరుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన మరో అవినీతి తిమింగిలంగా మారారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలకు సంబంధించి పక్కా ఆధారాలును సేకరించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు ఇల్లు, కార్యాలయంలో తనిఖీలు చేశారు. 
 
ఏసీబీ తిరుపతి డీఎస్పీ జనార్థన్ నాయుడు, అనంతపురం ఇన్‌చార్జి డీఎస్పీ జె.శివనారాయణ స్వామిలు ఆధ్వర్యంలో ఏసీబీ అధికారుల బృందం బుధవారం తిరుచానూరు సమీపంలోని యుగంధర్ నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఇందులో యుగంధర్ పేరుమీద ఉన్న రూ.2.72 కోట్ల ఆస్తుల్లో రూ.1.84 కోట్ల ఆస్తులు అక్రమంగా సంపాదించినవిగా గుర్తించారు. 
 
అలాగే, 850 గ్రాముల బంగారు ఆభరణాలు, 3.5 కేజీల వెండి వస్తువులతో పాటు కొంత నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఏసీబీ అధికారులు స్పందిస్తూ, గత 1999లో క్లర్కుగా ఉద్యోగంలో చేరిన యుగంధర్ పలు పదోన్నతులు పొంది ఇపుడు డిప్యూటీ డైరెక్టరుగా పని చేస్తున్నారని తెలిపింది. ఈ కాలంలో ఆయన భారీ స్థాయిలో అవినీతికి పాల్పడి, భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు పక్కా సమాచారం అందడంతోనే ఈ సోదాలు చేసినట్టు ఆయన తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments