Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో ఏఈ ఆస్తులు చూసి ఏసీబీ అధికారులు షాక్

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (15:54 IST)
అతనో  సాధారణ ఎలక్ట్రికల్ ఇంజనీర్... అతను జీతంతో పాటు గీతం కలిపి తాను సర్వీస్ చేసిన కాలంలో సంపాదిస్తే 2, 3 కోట్లు వుండొచ్చు. కానీ అతను సంపాదించిన ఆస్తులు చూసి ఇప్పుడు ఏసీబీ అధికారులులే షాక్ అవుతున్నారు.  కొమ్మది ఎలక్ట్రికల్ ఏ. ఇ నాగేశ్వరరావు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగంపై నాగేశ్వరావు ఆస్తులకు సంబంధించి ఏసీబీ అధికారులు గురువారం ఆరు చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
 
నాగేశ్వరరావుకు విశాఖలో సీతమ్మధార, సీతంపేట, విశాలాక్షి నగర్, ఎంవిపి కాలనీ, రాంబిల్లి ప్రాంతాలతో పాటు తెలంగాణ జిల్లాల్లో భూములు, ఇల్లు, స్థలాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అలాగే 3 బ్యాంకు లాకర్లు సీజ్ చేశారు. 1991 సర్వీసులో నాగేశ్వరరావు 94లో ఏసీబీ అధికారులకు చిక్కి సస్పెండ్ అయ్యారు.
 
2012లో తిరిగి విధుల్లో చేరిన నాగేశ్వరరావు లంచం ఇవ్వనిదే మీటర్ కనెక్షన్ కూడా మంజూరు చెయ్యరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏసీబీ అధికారులు దగ్గర ఉన్న ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో వందల కోట్లు విలువ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ దాడులు ఏసీబీ అడిషనల్ ఎస్పీ షకీలా భాను నేతృత్వంలో విశాఖ డి.ఎస్.పి కె.రంగరాజు, ఏసీబీ అధికారులు పాల్గొని సోదాలు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

సైన్స్‌కి మూఢ నమ్మకం మధ్య తేడాతో ఆది సాయి కుమార్ శంబాల టీజర్

ప్రసిద్ధ నృత్యకళాకారిణి, నటీమణి విజయభాను ఆకస్మిక మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments