Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళయిన వివాహితకు లవ్ ప్రపోజ్ చేసిన యువకుడు.. ఆ తరువాత?

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (15:34 IST)
వివాహమైన రెండు నెలలకే ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగింది. ఒక యువకుడు ప్రేమ పేరుతో వివాహితను వేధించడంతో ఆమె మనస్థాపంతో తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. మదనపల్లె గ్రామీణ మండలం కొత్తపల్లె పంచాయతీకి చెందిన రమ్య అనే యువతికి రెండునెలల క్రితం సమీప బంధువుతో వివాహమైంది. 
 
వివాహమైన తరువాత రెండు నెలల వరకు వీరి జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా బాగానే సాగింది. అయితే ఆ వివాహిత ఉన్న ఇంటి పక్కనే మంజునాథ్ అనే యువకుడు ఉండేవాడు. అతను వివాహిత సెల్ నెంబర్‌ను తీసుకుని ఫోన్‌లో లవ్ ప్రపోజ్ చేశాడు. పక్కింటి కుర్రాడే కదా తెలుసుకుంటాడులే అని ఊరుకుంది వివాహిత.
 
అయితే ఇంటి దగ్గరకు వచ్చి లవ్ ప్రపోజ్ చేయడం.. నువ్వు లేకుంటే చచ్చిపోతానంటూ బెదిరించడం.. ఇలా చేయడంతో విషయం కాస్త వివాహిత భర్త, అత్తమామల దృష్టికి వెళ్ళింది. ఇందులో రమ్య తప్పుందని భావించిన అత్తమామలు ఆమెను గత మూడురోజుల నుంచి హింసించడం మొదలుపెట్టారు. దీంతో మానసిక క్షోభకు గురైన వివాహిత తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు గల కారణాలను లేఖలో రాసింది రమ్య. దీంతో పోలీసులు యువకుడితో పాటు వివాహిత అత్త, మామలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments