Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడిలో ఒంటరిగా యువతి... మీదకు రాబోయాడు... కత్తితో ఏసేసింది...

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (15:54 IST)
ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఓ యువతి ఒక యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన వెలుగు చూసింది. కాగా ఆత్మరక్షణ కోసమే దాడి చేసానని యువతి చెబుతోంది. అనంతపురం జిల్లా తనకల్లు మండల కేంద్రంలోని ఇందిరానగర్‌కి చెందిన స్వప్న అనే యువతి సోమవారం నాడు అయ్యప్ప ఆలయంలో ఒంటరిగా కూర్చొని ఉండగా, ఆలయ పూజారి బంధువు మంజునాథ్ లైట్లు వేసేందుకు స్విచ్‌బోర్డ్ దగ్గరకు వెళ్లబోయాడు. 
 
మంజునాథ్ దురుద్దేశంలోనే తన దగ్గరకు వస్తున్నాడని భావించిన స్వప్న అతడి తలపై కత్తితో దాడి చేసింది. దాడిలో గాయపడిన మంజునాథ్‌ని స్థానికులు, బంధువులు కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అనంతపురం ఆస్పత్రికి తరలించమని వైద్యులు సూచించారు. 
 
విషయం తెలుసుకున్న పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఆమె ఆత్మరక్షణ కోసమే మంజునాథ్‌పై దాడి చేయాల్సి వచ్చిందని పోలీసులకు తెలిపింది. ఒంటరిగా ఉన్న తన దగ్గరకు మంజునాథ్ రావడాన్ని గమనించి, దగ్గరకు రావద్దని ఎంత వారించినా అతను అటే రావడం వల్ల భయంతోనే కత్తితో అతడిపై దాడి చేసానని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments