Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ .. ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (22:53 IST)
ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో 2 వేల జనాభా దాటిన ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. గ్రామాల్లో ఇళ్ల నుంచి సేకరించే చెత్తను తరలించడానికి, రోడ్ల పక్కన పెంచే మొక్కలకు ఆ ట్రాక్టర్ ద్వారానే నీటి తడులు అందించేందుకు ఈ ట్రాక్టర్లు వినియోగించేలా ఆలోచనలు చేస్తోంది.

ఈ ట్రాక్టర్ల నిర్వహణకు అయ్యే వ్యయ భారం సదరు గ్రామ పంచాయతీలపై పడకుండా ప్రభుత్వం మార్గాలను విశ్లేషిస్తుంది. రాష్ట్రంలో 2 వేలకు పైబడి, 5 వేల లోపు జనాభా ఉండే గ్రామాలు 5 వేల పైచిలుకు ఉన్నాయి. వీటికి సొంత ట్రాక్టర్లు అందుబాటులో లేవు. ఈ క్రమంలో 5 వేల లోపు జనాభా కలిగిన 5137 పంచాయతీలకు ట్రాక్టర్లు ఇవ్వాలని ప్రభుత్వం దాదాపు నిర్ణయం తీసుకుంది.

ఇవికాక 5 వేలకు పైబడిన జనాభా కలిగి సొంత ట్రాక్టర్లు లేని పంచాయతీలు 91 ఉన్నాయి. ఆయా పంచాయతీలకు కూడా ట్రాక్టర్లు ఇవ్వాలని భావిస్తోంది. మొత్తం 5,228 గ్రామాలకు ఉచితంగా కొత్తగా ట్రాక్టర్లు అంజేయాలన్నది ప్రభుత్వ యోచన. గ్రామ పంచాయతీ ఇతర అవసరాలకు కూడా ఈ ట్రాక్టర్లను వినియోగించుకునేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments