Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ .. ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (22:53 IST)
ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో 2 వేల జనాభా దాటిన ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. గ్రామాల్లో ఇళ్ల నుంచి సేకరించే చెత్తను తరలించడానికి, రోడ్ల పక్కన పెంచే మొక్కలకు ఆ ట్రాక్టర్ ద్వారానే నీటి తడులు అందించేందుకు ఈ ట్రాక్టర్లు వినియోగించేలా ఆలోచనలు చేస్తోంది.

ఈ ట్రాక్టర్ల నిర్వహణకు అయ్యే వ్యయ భారం సదరు గ్రామ పంచాయతీలపై పడకుండా ప్రభుత్వం మార్గాలను విశ్లేషిస్తుంది. రాష్ట్రంలో 2 వేలకు పైబడి, 5 వేల లోపు జనాభా ఉండే గ్రామాలు 5 వేల పైచిలుకు ఉన్నాయి. వీటికి సొంత ట్రాక్టర్లు అందుబాటులో లేవు. ఈ క్రమంలో 5 వేల లోపు జనాభా కలిగిన 5137 పంచాయతీలకు ట్రాక్టర్లు ఇవ్వాలని ప్రభుత్వం దాదాపు నిర్ణయం తీసుకుంది.

ఇవికాక 5 వేలకు పైబడిన జనాభా కలిగి సొంత ట్రాక్టర్లు లేని పంచాయతీలు 91 ఉన్నాయి. ఆయా పంచాయతీలకు కూడా ట్రాక్టర్లు ఇవ్వాలని భావిస్తోంది. మొత్తం 5,228 గ్రామాలకు ఉచితంగా కొత్తగా ట్రాక్టర్లు అంజేయాలన్నది ప్రభుత్వ యోచన. గ్రామ పంచాయతీ ఇతర అవసరాలకు కూడా ఈ ట్రాక్టర్లను వినియోగించుకునేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments