Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుప్తనిధుల కోసం శేషాచలం కొండలనే తవ్వేసిన ఘనుడు

Webdunia
సోమవారం, 17 మే 2021 (20:29 IST)
శేషాచలం అంటే గుర్తుకువచ్చేది తిరుమల వేంకటేశ్వరస్వామి. శ్రీనివాసుడు కొలువై ఉన్న స్థలం శేషాచలం. అలాంటి ప్రాంతంలో ఎప్పుడూ అటవీశాఖ సిబ్బంది పర్యవేక్షణ ఉంటుంది. ఎంతో జాగ్రత్తగా కొండలను కాపాడుకుంటూ వస్తున్నారు. శేషాచల వాసా గోవిందా అంటూ నామస్మరణలను కూడా భక్తులు చేస్తుంటారు.
 
అలాంటి ప్రాంతంలో ఒక వ్యక్తి ఏకంగా గుప్త నిధుల కోసం శేషాచలం కొండలనే త్రవ్వేశాడు. సంవత్సరం పాటు ఈ తతంగం మొత్తం సాగుతోంది. అది కూడా భారీ త్రవ్వకాలు చేసినట్లు  పోలీసులు గుర్తించారు. 80 అడుగుల సొరంగం వెలుగు చూసింది. అయితే నిందితుడు మంకు నాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
అలాగే అతనికి సహాయం చేసిన మరో ఆరుగురు కూలీలను అదుపులోకి తీసుకున్నారు అలిపిరి పోలీసులు. కొండల్లో గుప్త నిధులు ఉన్నాయని ఒక స్వామీజీ చెప్పడంతో సొరంగం త్రవ్వినట్లు అంగీకరించాడు నిందితుడు మంకునాయుడు. నిందితుడిని వెంటబెట్టుకుని సొరంగంను తనిఖీ చేశారు పోలీసులు.
 
కొండ లోపల 80 అడుగుల భారీ సొరంగాన్ని చూసి అవాక్కయ్యారు పోలీసులు. ఏడాది కాలంగా రహస్యంగా సొరంగం త్రవ్వకం సాగుతున్నట్లు గుర్తించారు. అసలు పోలీసులు, అటవీశాఖాధికారులు, టిటిడి విజిలెన్స్ కన్నుగప్పి ఇంతటి భారీ సొరంగం ఎలా త్రవ్వారన్న అంశంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments