Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదేళ్ళ బాలికపై అత్యాచారం, నడిరోడ్డుపై లాఠీతో బెండు దీశారు

Webdunia
మంగళవారం, 26 నవంబరు 2019 (22:16 IST)
చిన్నారులపై లైంగిక వేధింపులు ఈమధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. అభంశుభం తెలియని చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షిస్తున్నా కొంతమంది కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా చిత్తూరు జిల్లాలో జరిగిన సంఘటన అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
 
మదనపల్లి సమీపంలోని కలికిరి మండలం కొట్టాల గ్రామంలో 10 యేళ్ళ బాలికపై వీరభద్రయ్య అనే యువకుడు అత్యాచారం చేశాడు. నిందితుడిపై పోలీసులు ఫిర్యాదు చేశారు. నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి పోలీసులు ఈ రోజు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం నిందితుడిని స్టేషన్ నుంచి మళ్ళీ గ్రామానికి తీసుకెళ్ళారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు వీరభద్రయ్య.
 
దీంతో స్థానికులు వీరభద్రయ్యను పట్టుకున్నారు. అతన్ని చావబాది పోలీసులకు అప్పజెప్పారు. తమ కళ్ళుగప్పి తప్పించుకుంటావంటూ పోలీసులు లాఠీని ఝళిపించారు. యువకుడిని చావబాదారు. సర్.. క్షమించండి.. ఇంకోసారి తప్పు చేయను అంటూ ఆ యువకుడు రెండు చేతులు జోడించి ప్రాధేయపడుతున్నా పోలీసులు మాత్రం పట్టించుకోలేదు. అతడిని చావబాదారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడ్ని ఉరి తీయాలంటూ విద్యార్థి సంఘాలు కలికిరిలో నిరసన ర్యాలీ చేపట్టాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం