Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదేళ్ళ బాలికపై అత్యాచారం, నడిరోడ్డుపై లాఠీతో బెండు దీశారు

Webdunia
మంగళవారం, 26 నవంబరు 2019 (22:16 IST)
చిన్నారులపై లైంగిక వేధింపులు ఈమధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. అభంశుభం తెలియని చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షిస్తున్నా కొంతమంది కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా చిత్తూరు జిల్లాలో జరిగిన సంఘటన అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
 
మదనపల్లి సమీపంలోని కలికిరి మండలం కొట్టాల గ్రామంలో 10 యేళ్ళ బాలికపై వీరభద్రయ్య అనే యువకుడు అత్యాచారం చేశాడు. నిందితుడిపై పోలీసులు ఫిర్యాదు చేశారు. నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి పోలీసులు ఈ రోజు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం నిందితుడిని స్టేషన్ నుంచి మళ్ళీ గ్రామానికి తీసుకెళ్ళారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు వీరభద్రయ్య.
 
దీంతో స్థానికులు వీరభద్రయ్యను పట్టుకున్నారు. అతన్ని చావబాది పోలీసులకు అప్పజెప్పారు. తమ కళ్ళుగప్పి తప్పించుకుంటావంటూ పోలీసులు లాఠీని ఝళిపించారు. యువకుడిని చావబాదారు. సర్.. క్షమించండి.. ఇంకోసారి తప్పు చేయను అంటూ ఆ యువకుడు రెండు చేతులు జోడించి ప్రాధేయపడుతున్నా పోలీసులు మాత్రం పట్టించుకోలేదు. అతడిని చావబాదారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడ్ని ఉరి తీయాలంటూ విద్యార్థి సంఘాలు కలికిరిలో నిరసన ర్యాలీ చేపట్టాయి.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం