Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనాధనని చెప్పి యువతులను పెళ్ళి చేసుకుంటాడు... వారితో కలిసి బెడ్రూంలో..?

Webdunia
మంగళవారం, 16 జులై 2019 (15:29 IST)
కష్టపడకుండా ఈజీగా డబ్బులు సంపాదించడానికి కొంతమంది దొంగతనాలు చేస్తుంటారు. కొందరు మోసాలు చేస్తారు. కానీ గుంటూరు జిల్లా పిడుగురాళ్ళకు చెందిన ప్రవీణ్ మాత్రం పెళ్ళిని నమ్ముకున్నాడు. యువతులతో స్వీట్‌గా మాట్లాడి వారిని బుట్టలో వేసి వారిని పెళ్ళి చేసుకుని వారితో బెడ్రూంలో అసభ్యకరమైన ఫోటోలు దిగి డబ్బులు గుంజడం ఈ నిత్యపెళ్ళికొడుకు నైజం.
 
ఇలా మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ప్రవీణ్. భద్రాది కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి గ్రామంలో నివాసముండే ప్రవీణ్ అదే ప్రాంతంలో ఉంటున్న రాజేశ్వరి అనే యువతిని తనకు ఎవరు లేరని చెప్పి వివాహం చేసుకున్నాడు. మే 10వ తేదీన వీరి వివాహం జరిగింది.
 
అనంతరం రాజేశ్వరి పేరుతో మూడు బ్యాంకు ఖాతాలను తెరిపించి ఆమె దగ్గరున్న నగలు తాకట్టు పెట్టి రూ. 2 లక్షల వరకు రుణాలు తీసుకుని జల్సా చేశాడు. అంతేకాదు ఆమె దగ్గరున్న నగదును కూడా కాజేసి ఎంజాయ్ చేశాడు. ప్రవీణ్‌కు అప్పటికే రెండు వివాహాలయ్యాయని, మూడో పెళ్ళి ఎందుకు చేసుకున్నావంటూ కుటుంబ సభ్యులు ప్రశ్నించడంతో రాజేశ్వరి ఖంగుతింది. గొడవ జరుగుతున్న క్రమంలో ప్రవీణ్ అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. తాను మోసపోయానని తెలుసుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది. నిందితుడు పరారీలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments