Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణాజిల్లాలో దారుణం : అనుమానంతో భార్య గొంతుకోసిన భర్త!

Webdunia
సోమవారం, 15 సెప్టెంబరు 2014 (11:00 IST)
భార్యపై అనుమానంతో ఓ ప్రబుద్ధుడు గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. కృష్ణా జిల్లాలోని బందరు మండలం కరగ్రహారం గ్రామంలో ఈ దారుణం జరిగింది.
 
జొన్నలవారిమోడి గ్రామానికి చెందిన బొల్లా నాగేశ్వరరావు, కరగ్రహారం గ్రామానికి చెందిన భూలక్ష్మికి పదిహేనేళ్ల క్రితం వివాహమైంది. కొన్ని నెలలుగా వీరు కరగ్రహారం గ్రామంలో నివసిస్తున్నారు. పెళ్ళయిన నాటి నుండి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఉండటం, భూలక్ష్మిపై నాగేశ్వరరావుకు అనుమానం ఉండటంతో వేధిస్తుండేవాడు.
 
ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి సమయంలో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో నాగేశ్వరరావు కొబ్బరికాయలు నరికే కత్తితో భూలక్ష్మి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments