Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏం... కష్టమొచ్చింది తల్లీ నీకు...? పిల్లలతో నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నావే..!! ఎక్కడ?

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2015 (11:48 IST)
భర్తంటే ప్రాణం.. ఆమెకు.. ఆమె పిల్లలకు కూడా.. అతని ఆదరణ కోసం ప్రాకులాడారు. అయితే అతనిని నుంచి ఎటువంటి ఆదరణ లభించిలేదు. నిరాదరణే ఎదురయ్యింది. సంసారాన్ని గాలికొదిలేసి అప్పులు చేసి బలాదూర్ తిరగడమే అతని పని కావడంతో ఆ తల్లికి కష్ణమై పోయింది. దీంతో పిల్లలకు నిప్పంటించి, తాను కూడా నిప్పంటించుకుని హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలిలా ఉన్నాయి. 
 
హైదరాబాద్‌ గచ్చిబౌలిలో శనివారం తెల్లవారు జామున మెదక్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలం జప్తిలింగారెడ్డిపల్లె గ్రామానికి చెందిన నరేందర్‌ రెడ్డి, వినోద దంపతులు పదేళ్ల నుంచి హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. గత వారం రోజులుగా భర్త ఇంటికి రావడంలేదని, కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని వినోద సూసైడ్‌నోట్‌లో పేర్కొంది.
 
దీంతో తీవ్ర మనస్తాపం చెందిన వినోద పిల్లలు విఘ్నేష్‌ (7), జ్యోతి(8)లకు నిప్పంటించి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments