Webdunia - Bharat's app for daily news and videos

Install App

వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక విచారణ

Webdunia
గురువారం, 12 డిశెంబరు 2019 (08:17 IST)
వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో నేడు కీలక విచారణ జరగనుంది. ఈ కేసులో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని సిట్ అధికారులు విచారించనున్నారు. ఉదయం 11 గంటలకు కడప శివారులోని పోలీసు శిక్షణ కేంద్రానికి విచారణకు హాజరు కావాలని సీఆర్పీసీ 160 కింద నోటీసు ఇచ్చారు. 
 
మార్చి 15న పులివెందులలో వివేకా హత్య జరిగితే... 8 నెలల తర్వాత మాజీమంత్రిని విచారణకు పిలుస్తున్నారు. హత్య జరిగిన రోజే కొందరు వైకాపా నాయకులు ఆదినారాయణరెడ్డిపై ఆరోపణలు గుప్పించారు. పది రోజుల నుంచి కడపలో జరుగుతున్న సిట్ విచారణలో పలువురు కీలక నేతలను విచారిస్తున్నారు. 
 
ఇందులో భాగంగా నేడు ఉదయం ఆదినారాయణరెడ్డి విచారణకు హాజరుకానుండటం చర్చనీయాంశమైంది. ఈ నెల 5న ఆదినారాయణరెడ్డి సోదరుడు దేవగుడి నారాయణరెడ్డిని సైతం సిట్ అధికారులు విచారించారు. 
 
ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని... తప్పుందని తేలితే బహిరంగంగా ఉరేసుకుంటానని ఇప్పటికే అదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. వివేకా కేసు విచారణ సిట్​కు చేతకాకుంటే సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్​ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments