భార్య ఫోన్ లిఫ్ట్ చేయలేదని రెండేళ్ళ కూతురికి విషమిచ్చి చంపేసిన తండ్రి..

Webdunia
బుధవారం, 4 సెప్టెంబరు 2019 (16:52 IST)
కుటుంబమన్న తరువాత గొడవలు షరా మామూలే. పెళ్ళి చేసుకున్న తరువాత రకరకాల సమస్యలు వస్తుంటాయి.. సర్దుకుపొమ్మని పెద్దలు చెబుతుంటారు. కానీ చిత్తూరు జిల్లాలో మాత్రం ఒక వ్యక్తి తన భార్య ఫోన్ లిఫ్ట్ చేయలేదన్న చిన్న కారణంతో అభంశుభం తెలియని రెండేళ్ళ చిన్నారిని అతి దారుణంగా విషమిచ్చి చంపేశాడు.
 
చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలం రామాపురంకు చెందిన ఆదేశ్వర్, నందినీలకు నాలుగు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరిది ప్రేమ వివాహమే. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే గత రెండు నెలల నుంచి ఆర్థిక సమస్యల కారణంగా తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. అయితే గత రెండురోజుల క్రితం భర్తతో గొడవ వేసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది నందిని.
 
తన పెద్దకూతురిని తీసుకుని.. చిన్న కూతురిని ఇంట్లోనే వదిలి వెళ్ళిపోయింది. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు తన భార్యకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు ఆదేశ్వర్. అయితే ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య ఫోన్ తీయకపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు ఆదేశ్వర్. ఇంట్లో పురుగులు మందు రెండేళ్ళ కుమార్తెకు తాగించాడు. ఆ చిన్నారి చనిపోయిన తరువాత తాను కూడా ఆ పురుగుల మందు తాగాడు.
 
అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. స్థానికులు గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆదేశ్వర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

NBK 111: బాలక్రిష్ణ నటిస్తున్న ఎన్.బి.కె. 111 చిత్రం నవంబర్ 7న ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments