Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సు మిస్సైందని బైక్ ఎక్కితే... ఆ అమ్మాయిని మృత్యువు కాటేసింది...

రాజ‌మండ్రి : కాలేజీకి బ‌స్సు మిస్ అయింద‌ని బైక్ ఎక్కితే వ్యాన్ ఢీకొట్టడంతో ఆ అమ్మాయి ప్రాణం పోయింది. తూర్పుగోదావ‌రి జిల్లా పంద‌ల‌పాక‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలో ఆమె మాత్రమే డిగ్రీ చదువుతోంది. అదే పట్టుదలతో డిగ్రీ పట్టా పుచ్చుకోవాలని నిత్య

Webdunia
బుధవారం, 29 జూన్ 2016 (13:16 IST)
రాజ‌మండ్రి : కాలేజీకి బ‌స్సు మిస్ అయింద‌ని బైక్ ఎక్కితే వ్యాన్ ఢీకొట్టడంతో ఆ అమ్మాయి ప్రాణం పోయింది. తూర్పుగోదావ‌రి జిల్లా పంద‌ల‌పాక‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలో ఆమె మాత్రమే డిగ్రీ చదువుతోంది. అదే పట్టుదలతో డిగ్రీ పట్టా పుచ్చుకోవాలని నిత్యం శ్రమిస్తోంది. ఎప్పటిలాగే  కళాశాలకు బయలుదేరిన ఆమెకు సోమవారం బస్సు మిస్సయింది. ఆ బస్సు కోసం బైక్‌పై లిఫ్ట్ అడిగి బయలుదేరిన ఆమెను మార్గమధ్యంలో మృత్యువు కాటేసింది.
  
వివరాల్లోకి వెళితే... తూర్పు గోదావరి జిల్లా పందలపాక గ్రామానికి చెందిన జిలగం శ్రీనివాసరావు గ్రామంలో చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడు. అతనికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు వ్యాపారాన్ని చూసుకుంటుండగా, కుమార్తె గౌరీ దుర్గ (19) రామచంద్రపురం వీఎస్‌ఎం కాలేజీలో బీఎస్సీ సెకండియర్ చదువుతోంది. రోజూ ఉదయం 8 గంటలకు పందలపాక నుంచి తొస్సిపూడి సెంటర్‌కు సైకిల్‌పై వచ్చి, అక్కడి నుంచి రామచంద్రపురానికి ఆర్టీసీ బస్సులో వెళుతోంది. 
 
ఆ రోజు తొస్సిపూడి సెంటర్ వద్దకు వచ్చేసరికి అప్పుడే బస్సు బయలుదేరింది. దీంతో అటుగా బైక్‌పై వెళుతున్న తోటి విద్యార్థి ఊలపల్లి గ్రామానికి చెందిన రాపర్తి జయేంద్ర మణికుమార్‌ను బస్సు వద్దకు తీసుకువెళ్లాలని లిఫ్ట్ అడిగింది. ఆమెను తీసుకువెళుతుండగా, కొమరిపాలెం సూర్య మోడరన్ రైస్ మిల్లు వద్ద, రాయవరం వైపు నుంచి వచ్చిన వ్యాన్ వారి బైక్‌ను ఢీకొంది.
 
ఈ సంఘటనలో బైక్‌పై నుంచి గౌరీదుర్గ కిందపడగా, ఆమె తల మీదుగా వ్యాన్ దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. అనపర్తి ఎస్సై కె.కిషోర్‌కుమార్, బిక్కవోలు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కిషోర్‌కుమార్ తెలిపారు. ఆ కుటుంబంలో డిగ్రీ చదువుతున్న ఏకైక వార‌సురాలు గౌరీదుర్గను ఇంటిల్లిపాది ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నారు. వ్యాపారం పనిపై విశాఖపట్నం వెళ్లిన గౌరీ దుర్గ తండ్రి, సోదరుడు ఆమె మరణవార్త విని హుటాహుటిన ఇక్కడకు బయలుదేరారు. వారితో పాటు గౌరీదుర్గ తల్లి ఆమె మరణవార్తను విని బోరుమని విలపిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చంద్రబాబుని కలిసి చెక్కుని అందజేసిన డా. మోహన్ బాబు, విష్ణు మంచు

కార్తీ, అరవింద్ స్వామి పాత్రల్లోకి తొంగిచూసేలా చేసిన సత్యం సుందరం చిత్రం రివ్యూ

జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారా? ఆయేషా ఏమంటున్నారు...

వర్మ డెన్ లో శారీ మూవీ హీరోయిన్ ఆరాధ్య దేవి బర్త్ డే సెలబ్రేషన్

డ్రగ్స్ కేసులో మరో నటుడు అరెస్టు అయ్యాడు.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments