Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిలకలూరిపేట వద్ద రోడ్డుపై వెళుతున్న కారులో మంటలు, దగ్ధం

Webdunia
శనివారం, 1 మే 2021 (16:48 IST)
చిలకలూరిపేట: చెన్నై- కోల్కతా జాతీయ రహదారిపై నాదెండ్ల మండలం గణపవరం వద్ద గురువారం ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి తగలబడింది. తెనాలిలో మాంటిస్సోరి స్కూల్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న జేమ్స్ మొరైలీ తన కుటుంబ సభ్యులు నలుగురితో కలిసి కేరళ వెళ్లి అక్కడి నుంచి చెన్నైకు, చెన్నై నుంచి తెనాలి వస్తున్నాడు.

సిఆర్ కళాశాల సమీపంలోకి రాగానే ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగడంతో కారు పక్కగా ఆపి అందరూ కిందకు దిగారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధం అవగా, రెండు ల్యాప్‌టాప్‌లు, 15 వేల రూపాయల నగదు, దుస్తులు కాలిపోయాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments