Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాలంటీర్ల పోస్టులకి రాజీనామా చేసిన 850 మంది, వీరి అసలు రూపం ఇదేనంటున్న తెదేపా

ఐవీఆర్
బుధవారం, 3 ఏప్రియల్ 2024 (15:51 IST)
కృష్ణాజిల్లాకు చెందిన 850 మంది వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేసారు. వీరిలో ఎక్కువమంది మచిలీపట్నం నియోజకవర్గానికి చెందినవారుగా వున్నారు. వాలంటీర్లుగా తాము గత ఐదేళ్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నానీ, ఎన్నికల సంఘం నిబంధనలతో తాము తమ పనిచేసే అవకాశం లేకుండా పోయిందన్నారు. పెన్షనర్లకు డబ్బులు ఇచ్చేటపుడు వాలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేస్తారన్న ఫిర్యాదులతో వీరిని సీఈసి దూరంగా పెట్టింది. పెన్షన్లను అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. త్వరలో ఏర్పాట్లు చేస్తామని ఏపీ సీఎస్ తెలిపారు.
 
వాలంటీర్ల పోస్టులకు రాజీనామాలు చేసినవారు మాట్లాడుతూ... పేదల కోసం తాము గత ఐదేళ్లుగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈసీ నిర్ణయంతో తాము ఏమీ చేయలేకపోతున్నామనీ, అందుకునే ఉద్యోగాలు మానేసి వైసిపి కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు. వీరి నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు మాట్లాడుతూ... వారి ముసుగు తొలగి అసలు రూపం బయటపడింది. వారంతా పార్టీవారే. వాలంటీర్లు కాదు. ప్రజలకు సేవ చేస్తామని చెప్పి ఆ ముసుగులో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments