Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే వ్యక్తికి 658 సిమ్ కార్డులు... ఏఐ టూల్‌కిట్‌తో గుర్తింపు

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2023 (09:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో ఒకే వ్యక్తికి ఏకంగా 658 సిమ్ కార్డులు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని ఏఐ టూల్ కిట్ ద్వారా టెలికమ్యూనికేషన్ శాఖ గుర్తించి, విచారణకు ఆదేశించింది. అలాగే అజిత్ సింగ్ నగర్, విస్సన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోనూ మరో 150 సిమ్ కార్డులు జారీ అయ్యాయి. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
విజయవాడ నగరంలోని గుణదలలో ఒక వ్యక్తికి 658 సిమ్ కార్డులు జారీ కావడంతో టెలికమ్యూనికేషన్ అప్రమత్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒకే  ఫోటోతే, ఒకే నెట్‌వర్క్‌కు చెందిన ఈ సిమ్ కార్డులను విక్రయించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. సత్యనారాయణపురానికి చెందిన నవీన్ అనే యువకుడు వీటిని రిజిస్టర్ చేసినట్టు గుర్తించారు. 
 
అలాగే, అజిత్ సింగ్ నగర్, విస్సన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోనూ మరో 150 వరకు సిమ్ కార్డులు, నకిలీ పత్రాలతో జారీ అయినట్టు గుర్తించారు. వీటిని ఏఐ టూల్‌కిట్‌ను ఉపయోగించి టెలికమ్యూనికేషన్ శాఖ గుర్తించింది. ఒకే ఫోటోతో జారీ అయిన సిమ్ కార్డులు ఎక్కడికి వెళ్లాయి. వాటిని ఎవరు, ఎందుకోసం వినియోగిస్తున్నారన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments