Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురి దుర్మరణం!

Webdunia
బుధవారం, 22 అక్టోబరు 2014 (10:29 IST)
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. గోరంట్ల మండల పరిధిలోని బూచేపల్లి బస్‌స్టాప్ వద్ద ఆటో, లారీ ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందులో ఆరుగురు దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. 
 
మృతులందరూ పుట్టపర్తి మండలం పెడబల్లికి చెందిన వారుగా గుర్తించారు. మృతి చెందిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరంతా కూలి పనుల కోసం కర్ణాటకలోని బాగేపల్లి మార్కెట్‌కు ఆటోలో వెళుతుండగా ఈ దారుణం సంభవించింది. బెంగళూరు నుంచి తాడిపత్రి వస్తున్న లారీ ఎదురుగా వచ్చి ఆటోను ఢీకొంది. క్షతగాత్రులను హిందూపురం ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments