Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలికాచుకుందామని కూర్చుంటే కారు దూసుకెళ్లింది.. ఐదుగురు మృతి

అసలే చలికాలం. చలిమంట కాచుకుందామని ఓ నలుగురు మంటల ముందు కూర్చున్నారు. అంతే వారిపై అదుపు తప్పిన కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన కడపలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే

Webdunia
సోమవారం, 1 జనవరి 2018 (16:44 IST)
అసలే చలికాలం. చలిమంట కాచుకుందామని ఓ నలుగురు మంటల ముందు కూర్చున్నారు. అంతే వారిపై అదుపు తప్పిన కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన కడపలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కడప, పెండ్లిమర్రి మండలం ఇందిరానగర్ వద్ద చలి కాచుకుంటున్న నలుగురిపై కారు దూసుకొచ్చింది. ఈ ఘటనలో కారు డ్రైవర్‌తో పాటు నలుగు మృతి చెందారు.  
 
కారు వేంపల్లి నుంచి కడపవైపు వెళ్తుండగా అదుపు తప్పి రోడ్డు పక్కన చలిమంట కాచుకుంటున్న వారిపై నుంచి వెళ్లిందని పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనలో ఇందిరానగర్‌కు చెందిన లక్ష్మీనరసింహ (14), కార్తీక్ ‌(14), గిరి (15), భాస్కర్‌ (26) మృతి చెందారు. ఈ ఘటనపై  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 
ఈ దుర్ఘటనలో చలికాచుకుంటూ కూర్చున్న ఓ వ్యక్తి గాయాలతో బయటపడ్డాడు. అతడిని కడప రిమ్స్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే కారు ప్రమాదానికి కారణమైన ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments