Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలికాచుకుందామని కూర్చుంటే కారు దూసుకెళ్లింది.. ఐదుగురు మృతి

అసలే చలికాలం. చలిమంట కాచుకుందామని ఓ నలుగురు మంటల ముందు కూర్చున్నారు. అంతే వారిపై అదుపు తప్పిన కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన కడపలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే

Webdunia
సోమవారం, 1 జనవరి 2018 (16:44 IST)
అసలే చలికాలం. చలిమంట కాచుకుందామని ఓ నలుగురు మంటల ముందు కూర్చున్నారు. అంతే వారిపై అదుపు తప్పిన కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన కడపలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కడప, పెండ్లిమర్రి మండలం ఇందిరానగర్ వద్ద చలి కాచుకుంటున్న నలుగురిపై కారు దూసుకొచ్చింది. ఈ ఘటనలో కారు డ్రైవర్‌తో పాటు నలుగు మృతి చెందారు.  
 
కారు వేంపల్లి నుంచి కడపవైపు వెళ్తుండగా అదుపు తప్పి రోడ్డు పక్కన చలిమంట కాచుకుంటున్న వారిపై నుంచి వెళ్లిందని పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనలో ఇందిరానగర్‌కు చెందిన లక్ష్మీనరసింహ (14), కార్తీక్ ‌(14), గిరి (15), భాస్కర్‌ (26) మృతి చెందారు. ఈ ఘటనపై  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 
ఈ దుర్ఘటనలో చలికాచుకుంటూ కూర్చున్న ఓ వ్యక్తి గాయాలతో బయటపడ్డాడు. అతడిని కడప రిమ్స్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే కారు ప్రమాదానికి కారణమైన ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments