Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదాములో 3708 బస్తాల బియ్యం మాయం: అరెస్ట్ భయంతో పేర్ని నాని అజ్ఞాతం?

ఐవీఆర్
శనివారం, 14 డిశెంబరు 2024 (16:43 IST)
వారంలో కనీసం రెండుమూడు రోజులకు తగ్గకుండా మీడియా ముందు కనిపించే వైసిపి నాయకుడు పేర్ని నాని ఇపుడు కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం తన భార్య పేరుపై వున్న గోదాములో నిల్వ వుంచిన 3,708 బస్తాల బియ్యం మాయమయ్యాయి. దీనితో పౌరసరఫరాల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. పేర్ని నాని సతీమణి జయసుధతో పాటు గోదాము మేనేజర్ మానస్ తేజపైన మచిలీపట్నం తాలూకా పోలీసు స్టేషనులో కేసులు నమోదు చేసారు.
 
దీనితో అరెస్ట్ భయంతో జయసుధ ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేసారు. ఈ కేసు ఈ నెల 16కి వాయిదా పడింది. గోదాములో ఇలా భారీస్థాయిలో బియ్యం మాయమైన దగ్గర్నుంచి పేర్ని నాని కుటుంబం మొత్తం అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. శుక్రవారం వైసిపి తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలకు కూడా పేర్ని నానితో పాటు ఆయన కుమారుడు కిట్టు కూడా కనిపించలేదు. దీనితో వీరిని త్వరలో పోలీసులు అరెస్ట్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments