Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి ఎస్వీ జూలో మూడేళ్ల బాలుడు మృతి

Webdunia
గురువారం, 4 మే 2023 (14:50 IST)
తిరుపతిలో ఎస్వీ జూ పార్కులో విషాదకర ఘటన ఒకటి జరిగింది. బ్యాటరీ వాహనం ఢీకొట్టడంతో మూడేళ్ల బాలుడు మృత్యువాతపడ్డాడు. తిరుపతి రాయల్ నగర్‌కు చెందిన మనోజ్ అనే వ్యక్తి బెంగుళూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో పని చేస్తున్నాడు. ఆయన భార్య సుష్మ. తిరుపతిలో ఉంటుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు. అయితే, పిల్లలకు వేసవి సెలవు ఇవ్వడంతో సుష్మ తన ముగ్గురు పిల్లలతో పాటు సోదరుడిని కుమారుడిని తిరుపతిలో ఎస్వీ జూ పార్కుకు విహారానికి తీసుకెళ్ళారు. 
 
జూ పార్కులో ఒక చేత్లో కన్నబిడ్డను, మరో చేత్తో మేనల్లుడుని పట్టుకుని నడిచి వెళుతుండగా, సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన బ్యాటరీ వాహనం వెనుక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. బ్యాటరీ వాహనం చక్రాలు బాలుడిపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీన్ని గమనించిన జూ పార్కు సిబ్బంది హుటాహుటిన రుయా ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. 
 
అప్పటివరకు తన ముందే ఉన్న కుమారుడు చనిపోయాడని తెలియడంతో తల్లి కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. బ్యాటరీ వాహన డ్రైవర్‌ అజాగ్రత్త, వాహనాన్ని వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments