Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ప్రజావేదిక కూల్చివేతకు రెండేళ్లు... నాటి ధ్వంస రచన పాలన...

Webdunia
శనివారం, 26 జూన్ 2021 (08:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ సమావేశాల కోసం గత తెలుగుదేశం పార్టీ నిర్మించిన ప్రజా వేదికను ముఖ్యమంత్రిగా జగన్మోహన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూల్చివేశారు. ఈ ప్రజా వేదికను వైకాపా ప్రభుత్వం కూల్చివేసి జూన్ 25వ తేదీకి రెండేళ్లు పూర్తయ్యింది.
 
దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం ఆయన ట్వీట్‌ చేశారు. ‘దీని కూల్చివేతతో రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి విధ్వంసాలకు పునాది పడింది. తన పాలనా స్వభావాన్ని దీని ద్వారా ఆయన ప్రజలకు తెలియచెప్పారు. కూల్చివేతలు తప్ప కట్టింది ఒక్కటీ లేదు. 
 
ఈ రెండేళ్లలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు తిరోగమనబాట పట్టాయి. రెండేళ్లలోనే రాష్ట్రం ఇలా ఉంటే రాబోయే మూడేళ్లలో ఎలా ఉంటుందో!' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తన ట్వీట్‌కు కూల్చివేతకు ముందు, తర్వాత ప్రజా వేదిక ఫొటోలను ఆయన జత చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments