Webdunia - Bharat's app for daily news and videos

Install App

బహిర్భూమికి వెళ్లిన బాలికపై అత్యాచారం.. పరారీలో నిందితులు

Webdunia
ఆదివారం, 15 మే 2016 (11:41 IST)
విజయవాడకు సమీపంలోని విద్యాధరపురంలో ఇద్దరు కామాంధులు రెచ్చిపోయారు. బహిర్భూమికి వెళ్లిన 15 యేళ్ళ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. వీరి నుంచి తప్పించుకునేందుకు ఆ బాలిక చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆ బాలిక తన శీలాన్ని కోల్పోవాల్సి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... గొల్లపూడి నేతాజీ నగర్‌ పోస్టాఫీసు కార్యాలయం రోడ్డులో ఉంటున్న బాలిక (15) 8వ తరగతి చదువుతుంది. ఈ బాలిక రాత్రి 7 గంటలకు ఇంటికి కొద్ది దూరంలోని చెట్ల పొదల్లోకి బహిర్భూమికి వెళ్ళింది. గొల్లపూడి కోయకాలనీకి చెందిన లక్ష్మణ్‌, యశ్వంత ఆ బాలికను బలవంతంగా ముళ్ళ చెట్లు పొదల్లోకి తీసుకుని వెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
కుమార్తె ఇంటికి రాలేదని ఆమె తల్లిదండ్రులు వెతకగా, ముళ్ల చెట్లు పొదలలో పడి ఉంది. వెంటనే తల్లిదండ్రులు స్థానికుల సహాయంతో ఇంటికి తీసుకుని వెళ్ళి కుమార్తెను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

తర్వాతి కథనం
Show comments