Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ జూలో ఆడ సింహం మహేశ్వరికి గుండెపోటు...

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2023 (12:11 IST)
విశాఖపట్టణంలోని జూలో ఉన్న ఆడసింహం మహేశ్వరికి గుండెపోటు వచ్చింది. దీంతో అది మృత్యువాతపడింది. మయోకార్డియల్ ఇన్‌ఫ్రాక్షన్‌తో మహేశ్వరి మృతి చెందినట్టు జూ అధికారులు తెలిపారు. గత 2006లో గుజరాత్‌లో జన్మించి దీనిని 2019లో వైజాగ్ జూకు తరలించారు. సింహాల జీవితకాలం గరిష్టంగా 18 యేళ్లే అయినప్పటికీ 19వ యేట మరణించడం గమనార్హం. 
 
విశాఖపట్టణంలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్కులో ఉన్న మహేశ్వరికి శనివారం రాత్రి గుండెపోటు వచ్చిందని జూ అధికారులు తెలిపారు. వయసు మీదపడటంతో మయోకార్డియల్ ఇన్‌ఫ్రాక్షన్‌తో అది మరణించినట్టు పోస్టుమార్టం నివేదికలో తేలిందని తెలిపారు. 
 
గత 2006లో జన్మించిన మహేశ్వరి 2019లో గుజరాత్ రాష్ట్రంలోని సక్కర్ బాగ్ జూ నుంచి వైజాగ్ జూకు తరలించారు ఇది లక్షలాది మంది ఆసియాటిక్ సింహాలపై అవగాహన అందించడంతో పాటు సింహాల పరిరక్షణకు తోడ్పడినట్టు జూ అధికారులు తెలిపారు. సాధారణంగా సింహాల వయసు 16 నుంచి 18 యేళ్లు మాత్రమే జీవిస్తాయని కానీ మహేశ్వరి మాత్రం 19వ యేటలోకి అడుగుపెట్టిందని వారు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments