Webdunia - Bharat's app for daily news and videos

Install App

10 నెలల బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Webdunia
మంగళవారం, 28 మే 2019 (17:05 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. పది నెలల బాలికపై 15 సంవత్సరాల మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. ఈ దారుణానికి పాల్పడింది పొరుగింటి యువకుడే కావడం గమనార్హం. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు ఆదివారం సాయంత్రం చిన్నారని కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడని వెల్లడించారు. ఈ కేసులో బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడుని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరచగా, బాధితురాలిని ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. 
 
అలాగే, వంటచెరకు కోసం వెళ్లిన ఓ మహిళపై ముగ్గురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఛత్రాఘర్ ఏరియాలో జరిగింది. ఈ నెల 15వ తేదీ ఓ వివాహిత వంట చెరకు కోసం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. ఈ విషయాన్ని గమనించిన కొందరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments