Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం లీక్ - నంద్యాలలో 12 మంది అరెస్టు

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2022 (15:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రారంభ రోజున తెలుగు పరీక్ష జరిగింది. అయితే, ఈ పరీక్ష ప్రారంభానికి ముందే తెలుగు ప్రశ్నపత్రం వాట్సాప్‌లలో హల్చల్ చేసింది. దీనికి సంబంధించి 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. లీకేజీ సూత్రధారి రాజేశ్‌తో సహా మొత్తం 12 మంది ఉన్నారు. 
 
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లి హైస్కూల్‌ నుంచి ఈ ప్రశ్నపత్రం లీకైనట్టు గుర్తించారు. దీనిపై జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రశ్నపత్ర లీకైనట్టు వార్తలు రాగానే జిల్లా విద్యాశాఖాధికారి, పోలీసు అధికారులు వేగంగా విచారణ చేపట్టారన్నారు. 
 
పరీక్ష ప్రారంభమైన వెంటనే తన మొబైల్‌లో ప్రశ్నపత్రాన్ని ఫోటోలు తీసి, ఆ ఫోటోలను బయటవేచివున్న తెలుగు టీచర్లకు పంపించాడని తెలిపారు. ఈ కేసులో అరెస్టు అయినవారిలో నాగరాజు, నిలకంఠేశ్వర రెడ్డి, నాగరాజు, మధు, వెంకటేశ్వర్లు, దస్తగిరి, వనజాక్షి, దుర్గ, పోతునూరు, ఆర్యభట్టు, రంగనాయకులు ఉన్నారని తెలిపారు. 
 
ఇంత జరుగుతున్నా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహించిన చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్, ఫ్లయింగ్ స్క్వాడ్‌కు చెందిన నలుగురిని కూడా సస్పెండ్ చేసినట్టు తెలిపారు. ఇదిలావుంటే ప్రశ్నపత్రం లీకేజీ కేసులో అరెస్టు చేసిన వారిని గురువారం కోర్టులో హాజరుపరిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments