Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో కరోనా కలకలం... తాజాగా పది మందికి కరోనా వైరస్

Webdunia
మంగళవారం, 2 జనవరి 2024 (12:22 IST)
విశాఖపట్టణంలో కరోనా వైరస్ కలకలం చెలరేగింది. తాజా పది మందికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. పైగా ఇప్పటివరకు, అలాగే, రోజువారీగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. దీంతో ఈ సీజన్‌లో ఇప్పటివరకు కరోనా వైరస్ బారినపడిన వారి సంఖ్య 38కి చేరింది. వీరిలో 25 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 
 
గత నెల నాలుగో తేదీన విశాఖలోని కంచరపాలెంకు చెందిన సోమకళ అనే మహిళ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఆమెను ఆస్పత్రిలో చేర్చి చికిత్స పొందుతుండగా, ప్రాణాలు కోల్పోయింది. ఆమెకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులకు కూడా ఈ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. వీరితో పాటు ఇతరులకు కలిపి మొత్తం పది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై జిల్లా వ్యాప్తంగా కరోనా నిర్ధారణ టెస్టుల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. 
 
మరోవైపు, చలి కాలం కావడంతో సీజనల్ వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. రద్దీ ప్రదేశాలు, మార్కెట్లు, ఆలయాలు, ప్రార్థనలకు వెళ్లే సమయాల్లో ముఖానికి మాస్క్ ధరించాలని కోరుతున్నారు. పైగా, జనవరి నెలలో ఈ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు లేకపోలేదని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments