Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయ శక్తిగా ఎదగడమే మా ప్రజాఫ్రంట్ లక్ష్యం: గద్దర్

Webdunia
FILE
రాజకీయ శక్తిగా ఎదగడమే తమ ప్రజా ఫ్రంట్ లక్ష్యమని తెలంగాణా ప్రజా ఫ్రంట్ నాయకుడు గద్దర్ ప్రకటించారు. శనివారం హైదరాబాదులో ఏర్పాటు చేసిన సమావేశంలో గద్దర్ మాట్లాడారు. రాజ్యాంగబద్ధంగా ఉద్యమించడం ద్వారా తెలంగాణాను సాధిస్తామన్నారు.

ముఖ్యంగా తెలంగాణా వనరులను కాపాడుకోవడమే తమ లక్ష్యమన్నారు. తెలంగాణా ప్రజా ఫ్రంట్ రాజకీయ నాయకుల నుంచి పుట్టలేదనీ, గ్రామ పునాదుల నుంచి తెలంగాణాలో ఉన్న అనేక జేఏసీల నుంచి పుట్టుకొచ్చిందన్నారు.

పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టేవరకూ తమ ఫ్రంట్ ఉద్యమం చేస్తూనే ఉంటుందన్నారు. అదే తమ ప్రధమ లక్ష్యమని వెల్లడించారు. తెలంగాణాకు ఆది నుంచీ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తూనే ఉన్నదని ఆ పార్టీని దుయ్యబట్టారు.

ఇక తెలంగాణాకోసమే అంటూ ఉద్భవించిన పార్టీలు సైతం తెలంగాణా ప్రజలతో ఆటలాడుకుంటున్నాయనీ, ఎన్నికలే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాయి తప్ప తెలంగాణా సాధన దిశగా అడుగులు వేయడం లేదని విమర్శించారు.

తమ ఈ ఫ్రంట్‌లో తెలంగాణాకు చెందిన ఎన్నో జేఏసీలు, పార్టీలు, ప్రజలు, ఉద్యమ నేతలున్నారన్నారు. వీరితోపాటు తెలంగాణాకోసం కృషి చేస్తున్న అన్ని శక్తులను కలుపుకుని ముందుకు వెళతామన్నారు. గతంలో తామేమైనా తప్పులు చేసి ఉంటే మన్నించాలని తెలంగాణా ప్రజలను కోరారు. తెలంగాణాకు నవంబరు 1న అన్యాయం జరిగింది కనుక ఆ రోజును విద్రోహ దినంగా పాటించాలని తెలంగాణా ప్రజలకు పిలుపునిచ్చారు. దీనికి సంకేతంగా ప్రతి ఒక్కరు నల్ల బ్యాడ్జీలను ధరించాలని కోరారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

Show comments