వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్... ఒకవైపు తన తండ్రిని దేవుడిగా అభివర్ణిస్తూ మరోవంక రాష్ట్రాన్ని దోచుకుని తిన్నారని రాష్ట్రమంత్రి డి.ఎల్. రవీంద్రారెడ్డి ఆరోపించారు. వైఎస్సార్ దేవుడే అయితే ఆయన పాలనలో రాష్ట్రాన్ని దివాళా తీయించిన దుష్టుడు జగన్ అంటూ ఘాటుగా విమర్శించారు.
రైతులపై చూపిస్తున్న ప్రేమ, కరవుతో అన్నదాతలు అల్లాడిపోతున్నారంటూ వ్యక్తపరిచే కపట ప్రేమ అంతా పీఠంకోసమేనని ధ్వజమెత్తారు. ఏదో విధంగా సీఎం సీటులో కూర్చోవాలన్నదే ఆయన తాపత్రయం అని మండిపడ్డారు.
తెలుగుగంగ ప్రాజెక్టు గురించి జగన్కు ఏమి తెలుసని దాని గురించి మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. నిట్ పరీక్ష నిర్వహణకు సంబంధించి శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసిన అనంతరం, పరీక్షపై సోమవారంనాడు హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తామని తెలియజేశారు.