Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ వాదులు పోరాటం ఆపకండి: మల్లోజుల

Webdunia
శుక్రవారం, 25 డిశెంబరు 2009 (13:05 IST)
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేంత వరకు తెలంగాణ వాదులు పోరాటం కొనసాగించాలని మావోయిస్టు నేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ పిలుపునిచ్చారు. ఉద్యమంలో ఉన్న విద్యార్థులు, యువకులు పట్టు విడవకూడదని ఆయన చెప్పారు.

చిదంబరం తాజాగా చేసిన ప్రకటనను మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్టు మీడియాకు వెల్లడించారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో కిషన్ జీ ఫోన్ ద్వారా మీడియాతో మాట్లాడారు.

రాజకీయ పార్టీల నాయకులు చెబుతున్నట్లు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనంత మాత్రాన ప్రజలు ప్రాంతాల వారీగా విడిపోవడం జరగదని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ఏర్పాటుపై చిత్తశుద్ధి లేదని చిదంబరం ప్రకటన చూస్తే అర్ధమవుతుందని ఆయన కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిని దుయ్యబట్టారు.

మొన్న కేంద్రం చేసిన ప్రకటన సందర్భంగా ప్రత్యేక తెలంగాణకు నెహ్రూ కుటుంబం ఏ మాత్రం సుముఖంగా లేదని మరోసారి నిరూపితమైందన్నారు. మొదట చేసిన ప్రకటనతో చిదంబరం తెలంగాణ ప్రాంత ప్రజల మనస్సులను తాకారని కిషన్‌జీ తెలిపారు. తెలంగాణ ఏర్పాటు చేస్తే పార్టీ రెండుగా చీలిపోతుందని అదిష్ఠా నాన్ని కొంతమంది సీమాంధ్ర పెట్టు బడిదారులు, ధనవంతులు, పారిశ్రామికవేత్తలు కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారని ఆయన ఆరోపించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

Show comments