Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీజీ - కలాంలు ఇప్పటి ఎన్నికల్లో పోటీ చేస్తే డిపాజిట్లు రావు

Webdunia
సోమవారం, 2 జులై 2012 (18:56 IST)
WD
ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం లాంటివారు ఎన్నికల్లో పోటీ చేస్తే వారికి డిపాజిట్లు కూడా రావని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. "యంగిస్తాన్" కార్యక్రమంలో భాగంగా ఆర్కే తన భావాలను వెల్లడించారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో, స్ఫూర్తిప్రదాతలుగా పేరొందిన గాంధీజీ, అబ్దుల్ కలాం వంటివారు ఎన్నికల్లో పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావన్నారు. యువత చెప్పడానికేమో తమకు అలాంటి నాయకులు కావాలీ అని అంటారు... కానీ ఓటు దగ్గరకు వచ్చేసరికి వ్యవహారం మరోలా ఉంటుందని అన్నారు. ఓటు వేసేటపుడు మచ్చలేని నాయకుడెవరన్న సంగతి తెలిసినా, అతడిని వదిలేస్తున్నారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తమ ముఖ్యమంత్రిగా మీరు వైఎస్సార్‌ను చెపుతారా... చంద్రబాబును చెపుతారా.. అని ఓ విద్యార్థి ప్రశ్నించినపుడు, ఇద్దరు నాయకుల్లోనూ మంచి ఉందనీ, అదేవిధంగా లోటుపాట్లు కూడా ఉన్నాయన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... అవినీతి నాయకులకు దయచేసి యువత ఓటు వేయరాదన్నారు. అలాంటి వారికి ఓటు వేస్తే అవినీతిని ప్రోత్సహించినట్లవుతుందని చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

మంగ్లీ డ్రగ్ పార్టీలో మేం లేవంటున్న రచ్చ రవి, దివి వాద్య, కాసర్ల శ్యామ్

Avika Gor: ప్రియుడు మిలింద్ చంద్వానీతో అవికా గోర్ నిశ్చితార్థం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Show comments