Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంత దౌర్భాగ్యం.. తప్పులు తడకగా సీఎం తెలుగు ప్రసంగ పఠనం!!

Webdunia
గురువారం, 1 నవంబరు 2012 (13:05 IST)
File
FILE
ఎంత దౌర్భాగ్యం.. సాక్షాత్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి తెలుగును చదవడం కూడా రాదా? అవుననే సమాధానం ఆయనే స్వయంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు గురువారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగాయి. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఎగురవేరవేసి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో పాటు.. రాష్ట్ర ప్రగతిపై ప్రసంగించారు. ఇందుకోసం ఆయన ముందుగానే తెలుగులో ఒక ప్రసంగాన్ని తయారు చేసుకున్నారు.

ఈ ప్రసంగాన్ని బుల్లెట్ ప్రూఫ్ పోడియం నుంచి ప్రసంగించారు. ఆ సమయంలో రాష్ట్ర 'పురోగమనం', 'పురోగతి' వంటి పదాలతో పాటు అనేక కఠిన పదాలు వచ్చినపుడు వాటిని ఉచ్ఛరించలేక అచ్చు తప్పులు పలికారు. అక్షరాలా తెలుగులో రాసుకున్న ప్రసంగ పాఠాన్ని కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చదవలేకపోవడం గమనార్హం. ఇలాంటి పాలకులు యువతను దేశ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతారా? అని జనం అనుకోవడం కనిపించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Show comments