Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ సౌత్ నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్!!

ఠాగూర్
ఆదివారం, 31 మార్చి 2024 (14:45 IST)
రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్టణం సౌత్ నుంచి జనసేన పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థిని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎంపిక చేశారు. ఈ స్థానం నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పేరును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ - జనసేన - భారతీయ జనతా పార్టీలు కలిసి పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ మూడు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు జనసేన పార్టీ 21 అసెంబ్లీ, కాకినాడ, మచిలీపట్నం పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేస్తుంది. 
 
ఈ క్రమంలో ఇప్పటికే 18 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన పవన్ కళ్యాణ్ తాజాగా మరో స్థానానికి అభ్యర్థిని ఖరారు చేశారు. దీంతో జనసేన ఇప్పటివరకు 19 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్టయింది. ఇంకా రెండు స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ రెండింటిపై కూడా రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తాను పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చంద్రబాబుని కలిసి చెక్కుని అందజేసిన డా. మోహన్ బాబు, విష్ణు మంచు

కార్తీ, అరవింద్ స్వామి పాత్రల్లోకి తొంగిచూసేలా చేసిన సత్యం సుందరం చిత్రం రివ్యూ

జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారా? ఆయేషా ఏమంటున్నారు...

వర్మ డెన్ లో శారీ మూవీ హీరోయిన్ ఆరాధ్య దేవి బర్త్ డే సెలబ్రేషన్

డ్రగ్స్ కేసులో మరో నటుడు అరెస్టు అయ్యాడు.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments