Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోపాలపురంలో చంద్రబాబు: చేతుల్లో కర్పూరం వెలిగించుకుని హారతి ఇచ్చిన అభిమాని(Video)

ఐవీఆర్
శుక్రవారం, 5 ఏప్రియల్ 2024 (11:12 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఏపీని అభివృద్ధిలో అట్టడుగు స్థానంలోకి నెట్టిన వైసిపి ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించివేయాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఓ అభిమాని తన చేతుల్లో కర్పూరం వేసుకుని చంద్రబాబు నాయుడికి హారతి ఇచ్చారు.
 
అంతకుముందు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... ఏ నెలకి ఆ నెల అప్పు తెచ్చుకుంటేనే కానీ జీతాలు ఇవ్వలేడు, పింఛన్లు ఇవ్వలేడు ఈ అప్పుల జగ్గడు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంపద సృష్టిస్తాం. ఆ సంపదను ప్రజలకు పంచుతాం. అది మాతోనే సాధ్యం. రాష్ట్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తే నెలకు రూ.4000 పింఛన్‌ని ఇంటి దగ్గరకే తెచ్చి ఇచ్చే ఏర్పాటు చేస్తాం. అంతేకాదు... జగన్ ప్రభుత్వం పింఛన్లు ఇవ్వకుండా ఎవరినైనా ఇబ్బంది పెడితే, వారికి ఇప్పటి నుంచే రూ.4000 చొప్పున పింఛన్ ఇస్తాం.
 
ప్రజలకు, రాష్ట్రానికి ఏదైనా మంచి చేస్తే అది చెప్పుకుని ఓట్లు అడగాలి. దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజలకు మంచి చేయడం అన్నది జగన్ రెడ్డి చరిత్రలో లేదు. అందుకే ఎన్నికలు అనగానే శవ రాజకీయం మొదలుపెడతాడు ఈ దుర్మార్గుడు." అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments