Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో జగన్ గెలుస్తారు .. మేం కలిసి పని చేస్తాం : కేటీఆర్ జోస్యం

Webdunia
శనివారం, 30 మార్చి 2019 (15:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరుగనున్న ఎన్నికల్లో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా పార్టీ గెలవనుందని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోస్యం చెప్పారు. ఆయన తెరాస ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, కేసీఆర్ ఏర్పాటు చేసే ఫెడరల్ ఫ్రంట్‌లోకి జగన్ వస్తారని, ఢిల్లీలో చక్రం తిప్పబోతున్నామన్నారు. 
 
జగన్, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, అఖిలేష్ యాదవ్‌తో కలిసి పని చేస్తామన్నారు. ఈ ఐదేళ్లలో రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదని విమర్శించారు. పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామన్న మోడీ వేశారా? అని ప్రశ్నించారు. మాటలతో ఆకట్టుకోవడం తప్ప మోడీ చేసిందేమీ లేదని, ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి 150 మించి సీట్లు వచ్చే పరిస్థితి లేదని జోస్యం చెప్పారు. 
 
ఏప్రిల్ 11 తర్వాత పోడు భూముల సమస్యలను సీఎం కేసీఆర్ పరిష్కరిస్తారని చెప్పిన కేటీఆర్, గిరిజనుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ నేటికి ఇంకా పెండింగ్‌లో ఉందన్నారు. 16 ఎంపీ సీట్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తే.. మన మాట చెల్లుతుంది. ఢిల్లీ పీఠం మీద ఎవరు ఉండాలో నిర్ణయించేది మనమే అవుతాం. మనకు రావాల్సిన నిధులను సాధించుకుంటాం అని కేటీఆర్‌ స్పష్టంచేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments