Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్ర రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేసిన తెరాస నేత

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (11:34 IST)
మొన్నటి దాకా... ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి జోస్యాలు చెప్పుకొచ్చేసిన తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇప్పుడు తాజాగా ఆంధ్ర రాజకీయాలతో తమకేమీ సంబంధం లేదని చేతులు దులిపేసుకున్నారు.
 
ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసిన ఆయన, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో తమకు ఎలాంటి పాత్ర లేదనీ స్పష్టం చేసారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరిని గెలిపించాలో, ఎవరిని ఓడించాలో అక్కడి ప్రజలే నిర్ణయిస్తారనీ చెప్పుకొచ్చిన ఆయన సోమవారం మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. కేసీఆర్‌ తన కింద పని చేసారని చంద్రబాబు అనడం ఆయన అహంభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. చంద్రబాబు కాంగ్రెస్‌లో ఉన్నప్పడు అప్పటి సీఎంల కింద పని చేసారా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి పచ్చి అవకాశవాది అని ఆయన మండిపడ్డారు. 
 
ఎన్నికల తర్వాత ఎన్డీయేలో చేరబోమని చంద్రబాబు గట్టిగా చెప్పలేరనీ... ఎన్నికల సమయంలో నేతలు పార్టీలు మారడం సహజమేనని, గతంలో తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీలు మారారని గుర్తుచేసారు. మోడీ, రాహుల్‌ సైతం ఇతర పార్టీల నేతలకు కండువాలు కప్పుతూ తమ పార్టీల్లోకి ఆహ్వానిస్తున్నారనీ చెప్పుకొచ్చారు. జనసేన అధినేత పవన్‌ తెలంగాణలో ప్రచారం చేసినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదనీ.. కొన్ని జాతీయ పార్టీల కంటే తెరాసకే ఎక్కువ సీట్లు వస్తాయనే ధీమా కూడా ఆయన ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments