Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ - షర్మిల - విజయమ్మలు పందికొక్కులా? యామిని తీవ్ర వ్యాఖ్యలు

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (16:26 IST)
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి యామినేని సాధినేని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఆయన తల్లి వైఎస్. విజయలక్ష్మి, చెల్లి వైఎస్. షర్మిలు పందికొక్కుల్లా రాష్ట్రంపై పడ్డారని వ్యాఖ్యానించారు. 
 
ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ, జగన్ గత చరిత్రను తిరగేస్తే అవినీతే కనిపిస్తోందన్నారు. విజయమ్మ, షర్మిల రాష్ట్రంలో పర్యటించి ఉంటే టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కనిపించేదన్నారు. సీమ నీళ్లు తాగి ఉంటే ప్రాజెక్టులపై వీరు మాట్లాడేవారు కాదని చెప్పారు. 
 
వైకాపా ఎన్నికల గుర్తు ఫ్యాన్ అని.. ఆ ఫ్యాన్‌లోని మూడు రెక్కలు ఉంటాయన్నారు. ఆ రెక్కలో ఒక రెక్క జగన్, రెండో రెక్క నరేంద్ర మోడీ, మూడో రెక్క కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. సొంత జిల్లాలోని కడప స్టీల్ ప్లాంట్‌పై మోడీని జగన్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. మహిళల నుదిటిబొట్టును తుడిచేసిన వైఎస్ కుటుంబానికి... తెలుగుదేశం ప్రభుత్వం అందిస్తున్న పసుపు-కుంకుమ విలువ ఏం తెలుస్తుందని అన్నారు.
 
ఈనెల 11వ తేదీన జరుగనున్న ఎన్నికల్లో వైకాపా చిత్తుగా ఓడిపోతుందని ఆమె జోస్యం చెప్పారు. అందుకే కుట్రలు కుతంత్రాలు చేసేందుకు జగన్ మోహన్ రెడ్డి తన ప్రసంగానికి రెండు రోజుల విశ్రాంతినిచ్చారని ఆరోపించారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడం ఖాయమని ఆమె జోస్యం చెప్పారు. 

సంబంధిత వార్తలు

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రెండు భాగాలు, మూడు పాత్రల టీనేజ్ లవ్ స్టోరీతో ఎస్ కే ఎస్ క్రియేషన్స్ చిత్రం

సమంత, రాజ్ & డికె లాంచ్ చేసిన అనుపమ పరమేశ్వరన్ 'పరదా' ఫస్ట్ లుక్

ఆడ పిల్లనే అయితే ఏంటట ? అంటూ ప్రశ్నిస్తున్న పోలీస్‌ఆఫీసర్‌ చాందిని చౌదరి యేవమ్‌ లుక్‌

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments