Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన ప్రచార సమయం... బుసలు కొడుతున్న నోట్ల 'కట్టలు

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (16:23 IST)
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ఘట్టం ముగిసింది. ఆ తర్వాత ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అన్ని పార్టీలు తాయిలాల ప్రలోభాలకు తెరతీశాయి. పోలింగ్‌ సమీపిస్తున్న కొద్దీ.. నోట్ల కట్టల పాములు బయటకు వస్తున్నాయి. మంగళవారం ప్రచారానికి ఆఖరి రోజు, దీంతో ఇప్పటికే చేరుకున్న నగదును ముందే సిద్ధం చేసుకున్న జాబితాల ప్రకారం.. పంపిణీ మొదలైంది. మరికొందరైతే ఫోన్‌ పే, పేటీఎమ్‌లను వాడుతున్నారు. ఈ మొత్తం చిన్నగా ఉండటం అంతా స్నేహితులవడం వల్ల ఇలాంటి చోట పంపిణీ చాలా సులువుగా మారింది.
 
కాగా, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస భారీ విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు ఎలాగైనా ఈసారి సత్తా చాటాలని సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో నువ్వా-నేనా అన్నట్లుగా ప్రచారం చేస్తున్నా యి. మొత్తం 17 నియోజకవర్గాల్లో అన్ని పార్టీల అభ్యర్థుల ఖర్చు అనధికారికంగా రూ.50 నుంచి 60 కోట్లకు పైగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 
 
ప్రధానంగా భువనగిరి, నల్లగొండ, సికింద్రాబాద్, మల్కాజిగిరి, ఖమ్మం స్థానాల్లో అభ్యర్థుల ఖర్చు భారీగా ఉంటున్నట్లు సమాచారం. ఒక్కో నియోజకవర్గంలో రూ.150 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన ఐదు నియోజకవర్గాల్లోనే రూ.750 కోట్లు దాటనుంది. మిగిలిన 11 నియోజకవర్గాల్లో రూ.550 నుంచి రూ.660 కోట్ల వరకు ఖర్చు కావచ్చు. ఈ లెక్కన రూ.1,400 కోట్ల వరకు పార్టీలు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha: కాలేజీలో మహేష్ బాబుతో హాయ్-బై అనుకునేవాళ్లం.. కలిసి నటిస్తామని అనుకోలేదు.. త్రిష

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments