Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలిదశ ఎన్నికల ప్రచారం పరిసమాప్తం : ఆంధ్రప్రదేశ్‌లో బిగ్ ఫైట్

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (18:42 IST)
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా 91 లోక్‌సభ స్థానాలకు ఈనెల 11వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఈ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు కూడా ఓటింగ్ జరుగనుంది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. వీటిన్నింటికీ కలిపి ఒకేసారి పోలింగ్ జరుపనున్నారు. 
 
దేశంలో జరిగే తొలిదశలో 91 స్థానాలకు జరిగే ఎన్నికల పోలింగ్‌లో 1,280 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 25 లోక్‌సభ సీట్లకు  319 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అలాగే, 175 అసెంబ్లీ సీట్లకు 2,118 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఏపీలో మొత్తం 3,92,45,717 మంది ఓటర్లు ఉన్నారు. వీరు ఓటు హక్కును వినియోగించుకునేందుకు 45,920 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, వీటిలో 9 వేల పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. 
 
అలాగే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 లోక్‌సభ సీట్లకు 445 మంది పోటీ పడుతుండగా, అత్యధికంగా నిజామాబాద్ స్థానానికి ఏకంగా 185 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో 2,96,97,279 మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 34,094 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే, 17 లోక్‌సభ సీట్లలో 13 సెగ్మెంట్లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. నిజామాబాద్ స్థానంలో మాత్రం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, మిగిలిన 7 స్థానాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments