Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాపం... పవన్ కళ్యాణ్ భవితవ్యం ఏంటి?

Webdunia
గురువారం, 23 మే 2019 (19:53 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఏపీ ఓటర్లు తేరుకోలేని షాకిచ్చారు. శాసనసభ ఎన్నికల్లో సరికొత్త మార్పు తీసుకొస్తామని చెప్పి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన పార్టీ.. గురువారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో కనీసం ఒక్క స్థానంలో కూడా గెలుపొందలేకపోయింది. 
 
చివరకు పవన్ కళ్యాణ్ రెండు స్థానాల్లో పోటీ చేయగా, రెండు స్థానాల్లోనూ ఆయన ఓటమిపాలయ్యారు. విశాఖ జిల్లాలోని గాజువాక, వెస్ట్ గోదావరి జిల్లాలోని భీమవరం అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా ఆ రెండు స్థానాల్లో చిత్తుగా ఓడిపోయారు. 
 
భీమవరంలో వైకాపా అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్‌ చేతిలో 3,938 ఓట్ల తేడాతో పవన్‌ పరాజయం పొందారు. మరోవైపు విశాఖ జిల్లా గాజువాకలో కూడా ఆయన ఓటమి చెందారు.
 
అయితే, రాష్ట్రం మొత్తం మీద ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో మాత్రం జనసేన అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అక్కడి స్థానంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ రౌండ్ రౌండ్‌కి ఫలితం తారుమారవుతుండటంతో ఈ స్థానం నుంచి ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments