Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలుక తోకకు రెండు రూపాయలు

Webdunia
గురువారం, 1 నవంబరు 2007 (14:01 IST)
పంటలను నాశనం చేస్తున్న ఎలుకలపై మిజోరం రైతులు యుద్ధం ప్రకటించారు. రైతుల యుద్ధానికి మద్దతుగా ఎలుకలను మట్టుపెట్టిన వారికి పారితోషకాన్ని అందించే విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

ఎలుక తోక ఒక్కింటికి రెండు రూపాయలు ఇస్తామంటూ తాము ప్రవేశపెట్టిన పధకానికి రైతులు అనూహ్యంగా స్పందిస్తున్నారని పంట రక్షణ సహాయ అధికారి జేమ్స్ లాల్సియామ్లియానా తెలిపారు.

ఎలుకను మట్టుపెట్టినందుకు రుజువుగా ప్రజలు ఎలుక తోకను అందించవలసి ఉంటుందని వెల్లడించారు. రోజురోజుకు తమవద్దకు అత్యధిక సంఖ్యలో ఎలుక తోకలు చేరుకుంటున్నాయని జేమ్స్ అన్నారు.

ఎలుక తోకలు పునరావృతం కాకూడదనే ఉద్దేశ్శంతో అందిన ఎలుక తోకలకు పాత్రికేయుల సమక్షంలో దహనసంస్కారాలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాల వారీగా అందుకున్న ఎలుక తోకల గణాంకాలను ఆయన మీడియా ఎదుట ఉంచారు.

అజ్వాల్ జిల్లా - 11,106,
లుంగ్లైయ్ జిల్లా - 30,600,
కోలాసిబ్ - 10,000,
సెర్చిప్ - 10,500,
మామిట్ - 16,000

తాజా అంచనాలను అనుసరించి వరి పంట దిగుబడి 70 నుంచి 80 శాతం పడిపోయింది. ఇందులో ఎలుకల కారణంగా 80 శాతం, 20 శాతం పురుగుల మందు కారణంగా పడిపోయిందని వ్యవసాయ అధికారులు వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

Show comments