Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 15 April 2025
webdunia

పబ్‌జీ గేమ్‌తో పిచ్చెక్కిపోతున్న పిల్లలు... పెద్దలూ చూస్కోండి జాగ్రత్త

Advertiesment
students
, గురువారం, 14 మార్చి 2019 (20:19 IST)
ఈ మధ్య కాలంలో పబ్‌జీ గేమ్‌తో చాలా సమస్యలు వస్తున్నాయి. ఈ గేమ్ ఆడే పిల్లలు లేదా పెద్దల ప్రవర్తనల్లో మార్పులు రావడం, వారిలో హింసా ప్రవృత్తి పెరుగుతుండటంతో పాటు విద్యార్థుల చదువు కూడా నాశనం అవుతుండటంతో చాలా ప్రభుత్వాలు పబ్‌జీ, అలాంటి ఇతర గేమ్‌లను ఆడవద్దని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి.
 
తాజాగా గుజరాత్ అహ్మదాబాద్‌లో పబ్‌జీ గేమ్ ఆడిన పది మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసారు. ప్రస్తుతం గుజరాత్‌లో పబ్‌జీ గేమ్‌ను పూర్తిగా నిషేధించారు. పోలీసులు వెళ్లినా కూడా పది మంది విద్యార్థులు వారిని పట్టించుకోకుండా ఉండటంతో పోలీసులు వారందరినీ అరెస్ట్ చేసారు. అయితే అరెస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపేసారు.
 
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ల మంది ఫోన్‌లో పబ్‌జీ గేమ్ ఉన్నట్లు సమాచారం. ఈ గేమ్ ఆడే వారిలో హింస ప్రేరేపించబడుతోందని, వారిలో విపరీతమైన ప్రవర్తనకు దారి తీస్తోందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అయితే భారతదేశంలో కేవలం గుజరాత్‌లో మాత్రమే ఈ గేమ్‌పై నిషేధం ఉండటం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హువావే నోవా 4ఇ స్మార్ట్‌ఫోన్... కొనాలనుకునేవారు ఇవి తెలుసుకోండి